రేపు వాసవి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు

64చూసినవారు
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 20వ తేదీన కృత్తికా నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు మహిళలు లలిత సహస్ర పారాయణం చదువుతారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్