కలెక్టరేట్ ముందు పిడిఎస్ యు ధర్నా, అరెస్ట్

52చూసినవారు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ స్టేషన్ ను తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం సరికాదని జిల్లా అధ్యక్షుడు సురేష్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్