లక్ష్మయ్య కుటుంబానికి పరామర్శ
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య మృతి చెందడం పట్ల డిసిసి జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సిర్గాపూర్ సందర్శించి లక్ష్మయ్య కుటుంబానికి ఆయన పరామర్శించారు. ఈ మేరకు ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కృష్ణయ్య, ఎల్లమయ్య, నాగరాజు, అశోక్, అంబేద్కర్, రాములు, తదితరులు ఉన్నారు.