ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’

73చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’
నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ అందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. వసూళ్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, విలక్షణ నటుడు ఎస్.జె సూర్య విలన్ పాత్రలో నటించాడు.

సంబంధిత పోస్ట్