సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుండి షోకాజ్ నోటీసులు అందాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ మంగళవారం తెలిపింది. ఈ షోకాజ్ నోటీసులు అర్థరహితమని హిండెన్ బర్గ్ పేర్కొంది. ముందుగా నిర్దేశించిన ప్రయోజనాల కోసంఉన్నాయని తెలిపింది. భారతదేశంలో ధనవంతులు ఎక్కువ మొత్తంలో చేసిన అవినీతిని, మోసాన్ని బహిర్గతం చేసే వారి గొంతుకను నొక్కేందుకు, భయపెట్టే ప్రయత్నంగా పేర్కొంది.