2026లో టీ20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ పొట్టి టోర్నీ ఫార్మాట్ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. రెండు ప్రాథమిక రౌండ్లు, నాకౌట్గా టోర్నీ ఉంటుంది. 2024 తరహాలోనే 2026లోనూ 20 జట్లు పోటీ పడతాయి. మొత్తం 12 జట్లకు నేరుగా అర్హత లభించనుంది. అతిథ్య హోదాలో 2, గత టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 7 జట్లకు అర్హత ఉంటుంది. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంకతోపాటు రన్నరప్ హోదాలో దక్షిణాఫ్రికాకు నేరుగా అవకాశం లభించింది.