రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్‌

74చూసినవారు
రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్‌
ఇటీవల విమానాలకు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాశ ఎయిర్‌ విమానానికి సెక్యూరిటీ అలర్ట్‌ వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. మరోవైపు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి సైతం సెక్యూరిటీ అలర్ట్‌ వచ్చింది. దీంతో అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్