మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

57చూసినవారు
మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. కన్వర్ యాత్రపై నిబంధనలు విధిస్తూ ఈ రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కన్వర్ యాత్ర సాగే మార్గంలో ఉన్న హోటళ్లు, డాబాలు, దుకాణాల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులిచ్చాయి. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్