అరుణాచల్ప్రదేశ్లోని ఓ పోలింగ్ బూత్లో ఓటేసేది కేవలం ఒకే ఒక్క ఓటరు. ఆమె ఒక్క ఓటు కోసం ఎన్నికల సిబ్బంది ఏకంగా 300 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. అందులోనూ 39 కి.మీ కొండల్లో నడవాలి. చైనా సరిహద్దులో ఉండేమాలోగామ్కు సమీపంలోని హయులియాంగ్లో సోకెలా తయాంగ్ అనే 44 ఏళ్ల ఓటరు ఒక్కరే ఉంటారు. ఆమె కోసం పోలింగ్ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది.