ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు, సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఢిల్లీకి చెందిన సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.