ఆ ప్రాంతానికి లైఫ్ జాకెట్లతో పోలింగ్ సిబ్బంది

64చూసినవారు
ఆ ప్రాంతానికి లైఫ్ జాకెట్లతో పోలింగ్ సిబ్బంది
మేఘాలయలోని పశ్చిమ జైంతియా జిల్లాలోని కాంసింగ్ గ్రామానికి పోలింగ్ సిబ్బంది లైఫ్ జాకెట్లను ధరించి వెళ్తుంటారు. జిల్లా కేంద్రమైన జోవాయ్‌కి 69 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి వాహనాలు వెళ్లే అవకాశం లేదు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే గంటపాటు పడవలో ప్రయాణించాలి. ఇక్కడ 35 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 20 మంది పురుషులు, 15 మంది మహిళలు. ఈ గ్రామ ప్రజలు తమలపాకులను పండిస్తారు.

సంబంధిత పోస్ట్