మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఖండించిన షోయబ్

571చూసినవారు
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఖండించిన షోయబ్
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'నాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఫార్చూన్ బరిషల్ జట్టు నా కాంట్రాక్ట్‌ను రద్దు చేయలేదు. నేను మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా. దుబాయ్ మీడియాతో ముందస్తు ఒప్పందాల్లో భాగంగానే బీపీఎల్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్