బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్కు షాక్ తగిలింది. మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు అతడిపై అధికారికంగా అభియోగాలు మోపింది. అతడు మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు వెల్లడించారు. తాను నిర్దోషినని చెప్పారు. కాగా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు గతేడాది ఉద్యమించిన సంగతి తెలిసిందే.