ప్రధాన మంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలని నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మోదీ కేంద్రీకృతమై పీఎంవో ఉండకూడాదన్నారు. మూడవసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ.. ఇవాళ పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పీఎంవో సిబ్బందితో మాట్లాడారు. 2014 ముందకు పీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేది, కానీ అది ప్రజలు పీఎంవోగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.