చెపాక్ వేదికగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఓటమి పాలైంది. అయితే పిచ్ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే భారీ స్కోరు చేసే అవకాశం చేజారిందని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. కనీసం మరో 30 పరుగులు చేసినా ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదని పేర్కొన్నాడు. ‘మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ను అంచనా వేయడంలో ఇబ్బంది పడ్డాం. వికెట్లను చేజార్చుకోవడంతో ప్రత్యర్థిపై భారీగా లక్ష్యం నిర్దేశించలేకపోయాం’ అని వివరించాడు.