నాసిరకం విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు
రైతులకు నాసిరకం విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరపాటి శివప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రామంచ, అల్లిపూర్, చిన్నకోడూరు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణదారులు రైతులకు కల్తీ లేకుండా విత్తనాలు, ఎరువులు అమ్మాలన్నారు. దుకాణాలలో ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు.