108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

4208చూసినవారు
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
చేగుంట 108 అంబులెన్స్ వాహనంలో ఓ మహిళ ప్రసవించింది. వల్లభాపూర్ గ్రామానికి చెందిన దివ్య అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతూ బంధువులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటి రమేష్ నార్మల్ డెలివరీ చేశారు. శుక్రవారం రాత్రి దివ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డను ఆస్పత్రికి తరలించారు.