భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవం

36813చూసినవారు
భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవం
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో భార్యను హత్య చేసిన భర్త గంట రవి (33)కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిద్ధిపేట న్యాయమూర్తి రఘురామ్ తీర్పునిచ్చినట్లు సిపి అనురాధ తెలిపారు. సీపీ మాట్లాడుతూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గంట యాదవ్వ (26)పై భర్త రవి అనుమానం పెంచుకున్నాడు. 2017 జూన్ 27న అనుమానంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్