కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
చేగుంట మండలం కొండాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ మరియు బీజేపీ నుంచి పలువురు గ్రామస్తులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు నవీన్ కుమార్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, AMC చైర్మన్ రజనక ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.