బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

25703చూసినవారు
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన వర్గల్ మండలంలోని మీనాజీపేట శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. గౌరారం ఎస్సై శివకుమార్ తెలిసిన వివరాల ప్రకారం. మీనాజీపేటకు చెందిన మంగలి నరేష్ వృత్తి పనిలో భాగంగా మంగళవారం మనోహరబాద్ మండలం రంగాయిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు. అక్కడ పనులు ముగించుకొని ఇంటికొస్తుండగా గ్రామ శివారులో వాహనం అదుపు తప్పి కిందపడగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్