హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజా హిత యాత్రను వ్యతిరేకిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం అనిల్ కుమార్, గొడిశాల యాదగిరి, పాక రమేష్, శనిగరపు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.