తమ్ముడిని హత్య చేసిన అన్న
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో అన్నదమ్ముల మధ్య వివాదం దారుణ హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అన్నదమ్ములు. ఇద్దరి మధ్య భూ వ్యవహారంలో వాగ్వాదం కొనసాగుతోంది. మంగళవారం మరోసారి అన్నదమ్ములు దాడికి దిగారు. ఈ క్రమంలో అన్న తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.