ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్

14599చూసినవారు
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. గురువారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్