సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో గల అటవీ ప్రాంతంలో లెక్కలేనన్ని నెమళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం జిన్నారం మండలం కొడకంచి శివారులోని అటవీ ప్రాంతంలో జాతీయ పక్షులు సందడి చేశాయి. రోడ్లపైకి జనావాసాల మధ్యకు వచ్చి చూపరులను జాతీయ పక్షులు ఆకట్టుకుంటున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడటం అనుకూలమైన వాతావరణం ఉండడం చిట్టడవులు వృద్ధి చెందడం నెమళ్లు పెరగడానికి కారణమని పలువురు చెబుతున్నారు.