జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

21566చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులు ఒకదాని వెనుక ఒకటి మూడు బస్సులు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఓ బస్సు డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోగా, ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్