చలి తట్టుకోలేక శ్మశానంలో పడుకున్నాడు (వీడియో)

308015చూసినవారు
ఉత్తర భారతదేశంలో చలి తీవ్రంగా ఉంది. యూపీ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల వరకు దట్టమైన మంచు ఉంటోంది. ఇక యూపీలోని కాన్పూర్‌లో చలికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వృద్ధుడు చలి తట్టుకోలేక శ్మశానవాటికలో పడుకున్నాడు. కాలిపోతున్న మృతదేహాలకు దగ్గరగా ఆ వృద్ధుడు పడుకోవలసి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడి దుస్థితి, పేదరికాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు.

సంబంధిత పోస్ట్