సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారికి అభిషేకాలు, పట్నాలు, ఒడిబియ్యం, అర్చనలు, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆలయ ఈవో, సిబ్బంది పర్యవేక్షించారు.