హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే

57చూసినవారు
హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఆరుగురు గర్భిణీలు తీవ్ర అవస్థలు పడ్డ వీడియో వైరల్ గా మారింది. ఘటనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లి గర్భిణీలను పరామర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి డాక్టర్లను ఆరా తీశారు. గర్భిణీలు ఇబ్బందులు పడటానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.