ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో జరిగింది. ధర్మపురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడి ధనుంజయ్ (22) హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న వైజాగ్కు ఓ వివాహానికి వెళ్లి ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.