మంథని మండలం చిల్లపల్లిలో బీరప్ప ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీర్ల వారి డప్పుసప్పుల మద్య గ్రామంలోని కుర్మ,గొల్ల కులస్థులు బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.