భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కౌన్సిలర్

53చూసినవారు
వేములవాడ పట్టణంలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని 27వ వార్డ్ కౌన్సిలర్ గోలి మహేశ్ అన్నారు. మున్సిపల్ పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులు అనునిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరద నీరు వార్డుల్లోకి రాకుండా డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్