గుజరాత్లో అనుమానాస్పద వైరస్ కలకలం సృష్టిస్తోంది. దానివల్ల జులై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్ పటేల్ వెల్లడించారు. బాధితులు సబర్కాంతా, ఆరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారని మంత్రి తెలిపారు. పూర్తిస్థాయి ధ్రువీకరణ నిమిత్తం నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాం’’ అని మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.