ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 71 మంది మంత్రులతో కూడిన మండలిలోని మోదీ కొత్త మంత్రివర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం గమనార్హం. మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్నాథ్ సింగ్, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ఉన్నారు. అలాగే బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కూడా మోడీ మంత్రివర్గంలో చేరారు.