భారత్లో అత్యంత ఆదరణ పొందిన బైక్ స్ల్పెండర్. ఇది మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త వెర్షన్ను విడుదల చేసింది. స్ల్పెండర్+ ఎక్స్టెక్ 2.O పేరిట వస్తున్న ఈ బైక్ ధర రూ.82,911 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). గత ఎక్స్టెక్ వెర్షన్తో పోలిస్తే రూ.3,000 అధికం. డిజైన్పరంగా స్ల్పెండర్+ ఎక్స్టెక్ 2.Oలో హీరో పెద్దగా మార్పులు చేయలేదు.