ఎమిరేట్స్‌ విమానంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం

80చూసినవారు
ఎమిరేట్స్‌ విమానంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం
చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన ఎమిరేట్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం రెక్కల నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని నిలిపివేశారు. అనంతరం విమాన సిబ్బంది, టెక్నికల్‌ టీమ్‌ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. 10 నిమిషాల్లో పొగ ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 320 మంది ప్రయాణికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్