హిమాచల్ప్రదేశ్లో భారీ హిమపాతం కురుస్తోంది. ఈ క్రమంలో సోలాంగ్ నాలా, అటల్ టన్నెల్తో సహా మనాలి పరిసర ప్రాంతాల్లో 1000కిపైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కులు లోని స్కై రిసార్టు వద్ద చిక్కుకున్న 5 వేల మందిని కాపాడినట్టు అధికారులు వెల్లడించారు. వెయ్యికిపైగా వాహనాల్లో చిక్కుకున్న పర్యటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు.