బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్, రాహుల్, కోహ్లీ స్వల్ప స్కోరుకే అవుటైనా నితీశ్ కుమార్ రెడ్డి తగ్గెదేలా అన్నట్లు రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 171 బంతుల్లో 103* పరుగులు చేశాడు. కాగా భారత్ ఇంకా 121 పరుగులు వెనుకబడి ఉంది.