మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో పోలీస్ యూనిఫాం ధరించిన 11 మంది సాయుధ వ్యక్తులను పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ సిబ్బంది గుర్తించారు. ఆ వ్యక్తులను నిర్బంధించి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గలేదు.