యూపీలోని బులంద్షహర్ జిల్లాలో తాజాగా దారుణం జరిగింది. దుర్గేష్ శర్మ అనే వ్యక్తి తన తల్లి పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. వృద్ధురాలైన తల్లిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. కొడుకు నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ పరుగులు పెట్టింది. అయినప్పటికీ దుర్గేష్ ఆమెను వెంబడించి, కనికరం లేకుండా దాడి చేశాడు. దీనిని ఓ స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.