మాజీ కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్- రాజౌరీ సీటు నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ (DPAP) తెలిపింది. DPAP వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ పోటీపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్లో ప్రకటించారు.