దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. దీంతో సౌతాఫ్రికా జట్టు 7.5 ఓవర్లలో 42 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లు వేసిన అర్ష్దీప్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్ *8, క్లాసెన్ 0* ఉన్నారు.