ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఏడు వికెట్లతో తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 180 రన్స్ టార్గెట్ ని 29 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సౌతాఫ్రికా సెమీస్కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 179 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. బ్యాటర్లు దుస్సెస్(72), క్లాసెన్(64) నిలకడకగా రాణించడంతో సునాయాసంగా గెలిచింది.