AP: మే నెలలో తల్లికి వందనం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే రైతులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం చేసే వీలుంటేనే హామీ ఇస్తామని లేకుంటే మాయమాటలు చెప్పమన్నారు. 2 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.