భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

61చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 30కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. రద్దయిన వాటిలో సికింద్రాబాద్-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌), విశాఖపట్నం-సికింద్రాబాద్ (వందేభారత్)తో పాటు పలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్