శ్రీశైలం 4 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

78చూసినవారు
శ్రీశైలం 4 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని నాలుగు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌ డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా వస్తున్న వరద ప్రవాహంతో మొదటగా ఒక గేటును ఎత్తిన అధికారులు ప్రవాహం పెరగడంతో శనివారం మరో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా లక్షా 36 వేల క్యూసెక్కులను వదిలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్