దేశసరిహద్దుల్లో ఉన్న బోర్డర్ పోస్టుల్లో సేవలందిస్తున్న సైనికులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్ అందించడం కోసం కేంద్రం చర్యలు చేపట్టనుంది. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.