దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నేడు కూడా నష్టాల్లోనే ముగిశాయి. వరుసగా ఆరో రోజూ నష్టాలను చవిచూశాయి. మార్కెట్లో అస్థిరత నెలకొనడం, షేర్ హూల్డర్లు అప్రమత్తంగా వ్యవహారించడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 వద్ద ముగియగా నిఫ్టీ 27.80 పాయింట్ల నష్టంతో 23,044 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీన పడి 86.88 వద్ద ముగిసింది.