దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. హోలీ సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈకి సెలవు కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్ 200.85 పాయింట్ల నష్టంతో 73,828.91 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73.30 పాయింట్ల నష్టంతో 22,397.20 వద్ద స్థిరపడింది. జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.