నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

82చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 73.48 పాయింట్ల స్వల్ప నష్టంతో 81,151.27 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 72.95 పాయింట్లు కోల్పోయి 24,781.10 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07గా ముగిసింది. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. HDFC బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్