డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేసిన యూట్యూబర్లు, కేసు నమోదు

83చూసినవారు
TG: హైదరాబాద్‌లో ప్రముఖ యూట్యూబర్లపై ఆదివారం కేసు నమోదైంది. కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశారని కాప్రాకు చెందిన నగల వ్యాపారి గుడివాడ రమణ్‌లాల్‌ ఆరోపించారు. వారి వేధింపులు తాళలేక సోమాజిగూడ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. యూట్యూబర్లు దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణ తనను కలిసి రంగు రాళ్లతో 10 మంది మోసపోయారని యూట్యూబ్‌లో తనపై తప్పుడు ప్రచారం చేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్